జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 15 మంది మావోయిస్టులు మృతి | Few Maoists Died In Jharkhand Encounter | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 15 మంది మావోయిస్టులు మృతి

Jan 22 2026 11:33 AM | Updated on Jan 23 2026 7:46 AM

Few Maoists Died In Jharkhand Encounter

చైబాసా: జార్ఖండ్‌ రాష్ట్రంలోని చైబాసాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌ 15 మందికి పైగా మావోయిస్టులు మృతిచెందారు. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు పతిరామ్‌ మాంఝీ అలియాస్‌ అనల్‌ మృతి చెందాడు. కాగా, పతిరామ్‌ తలపై ఆరు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.5కోట్ల వరకు రివార్డ్‌ ఉంది.

గత కొన్నేళ్లుగా మావోయిస్టు ఆర్గనైజేషన్‌లో అనల్‌ కీలకంగా పనిచేస్తున్నాడు. భద్రతా బలగాలపై భారీ దాడులకు ఇతడే వ్యూహ రచన చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌, సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. మావోయిస్టుల ఏరివేత కొనసాగుతున్న క్రమంలో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కోబ్రా బెటాలియన్‌ 209తో ఈ ఆపరేషన్‌ చేపట్టారు. 

కాగా, గత ఆదివారం(జనవరి 18వ తేదీ) ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసు బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగిన ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా..  అంతకుముందు రోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. నలుగురు మహిళా మావోయిస్టులతో సహా మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.

మార్చి నాటికి మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్రం చెప్పినట్లుగానే.. ఆపరేషన్‌ కగార్‌ను ప్రారంభించింది. ఆపరేషన్‌ కగార్‌ దెబ్బతో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. గత కొంతకాలంగా మావోయిస్టులు భారీ సంఖ్యలో అడవుల్ని వీడి.. జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. అదే సమయంలో  ఎన్‌కౌంటర్‌లు కూడా కొనసాగుతున్నాయి.  మావోయిస్టుల ఏరివేతలో భాగంగా అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement