మాజీ మంత్రిని నిర్బంధించిన రైతులు.. చేతులు జోడించి క్షమాపణ చెప్పాకే..

ExMinister Apology After Haryana Farmers Hold Him Hostage In Temple - Sakshi

గుర్‌గావ్‌: ప్రధాని మోదీ కేదార్‌నాథ్‌ పర్యటన ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీలో వీక్షించేందుకు ఆలయానికి వెళ్లిన బీజేపీ నేతలను రైతులు దిగ్బంధించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు సాగిస్తున్న రైతులను దుర్భాషలాడారంటూ మాజీ మంత్రి మనీష్‌ గ్రోవర్‌ లక్ష్యంగా రైతులు బీజేపీ నేతలను దాదాపు 8 గంటలపాటు ఎటూ కదలనీయలేదు. పోలీసులు జోక్యం చేసుకున్నా వెనక్కి తగ్గలేదు.

చివరికి మనీష్‌ గ్రోవర్‌ చేతులు జోడించి క్షమాపణ చెప్పాకే అందరినీ వదిలిపెట్టినట్లు రైతులు తెలిపారు. హరియాణా రాష్ట్రం రొహ్‌తక్‌ జిల్లా కిలోయిలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, రైతులకు క్షమాపణ చెప్పారంటూ వచ్చిన వార్తలను మాజీ మంత్రి గ్రోవర్‌ ఖండించారు.  మరో ఘటన.. హిసార్‌ జిల్లా నిర్నావుండ్‌ వద్ద కొందరు వ్యక్తులు బీజేపీకి చెందిన రాజ్యసభ ఎంపీ రామ్‌చందర్‌ కారు అద్దాలను పగులగొట్టారు.  

చదవండి: (కొరడా దెబ్బలు తిన్న సీఎం.. ఎందుకో తెలుసా?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top