
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లా.. మిగతా 14 రోజులు తాము ఇక్కడ చేసే పరిశోధనే అత్యంత ఆసక్తిని కల్గిస్తుందని స్పష్టం చేశాడు. ప్రస్తుతానికి కాస్త చిన్నపాటి తలనొప్పిగా ఉన్నప్పటికీ అదేమీ పెద్ద సమస్య కాదన్నాడు. తమ ముందున్న టాస్క్ అనేది చాలా ముఖ్యమని చెప్పుకొచ్చాడు శుభాంశు శుక్లా. ‘ ఇది చాలా గర్వించదగ్గ సమయం. మన అంతరిక్షయానంలో ఇదొక మైలురాయి. 14 రోజుల పరిశొధన మాకు అత్యంత కీలకం కానుంది’ అని తెలిపాడు ఐఎస్ఎస్ నుంచి స్పష్టం చేశాడు శుభాంశు.
కాగా, అంతరిక్ష పరిశోధనల్లో మరో కలికితురాయి. 28 గంటల సుదీర్ఘ వ్యోమనౌక ప్రయాణం తర్వాత ఐఎస్ఎస్లోకి శుభాంశు శుక్లా బృందం అడుగుపెట్టింది. ఫలితంగా శుభాంశు శుక్లా అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు.
శుభాంశు శుక్లా బృందం యాక్సియం-4 మెషిన్ ద్వారా అంతర్జాతీయ పరిశోదనా కేంద్రంలోకి అడుగు పెట్టనుంది. ఇప్పటి నుంచి 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది. ఇంతకు ముందు ఐఎస్ఎస్తో స్పేస్ డాకింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియ విజయవంతమైంది.
14 రోజుల పాటు శాస్త్రీయ ప్రయోగాలు
శుభాంశు శుక్లా బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 14 రోజుల పాటు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనుంది. ఈ ప్రయోగాలు ప్రధానంగా భారరహిత స్థితిలో మానవ శరీరంపై ప్రభావం, పోషకాహార వ్యవస్థలు, జీవనాధార సాంకేతికతలు, రోగనిరోధక వ్యవస్థ వంటి అంశాలపై దృష్టి సారించనుంది. అలాగే, ఇస్రో తరఫున శుభాంశు ఏడు ముఖ్యమైన ప్రయోగాలు చేస్తారు. దీంతో పాటు నాసా నిర్వహించే ఐదు ఉమ్మడి అధ్యయనాల్లోనూ ఆయన పాల్గొంటారు. మొత్తం మీద, యాక్సియం-4 మిషన్లో పాల్గొన్న వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలు చేపడతారు. ఇది ఒకే మిషన్లో అత్యధిక ప్రయోగాలుగా గుర్తింపు పొందుతోంది.