ఎనిమిదేళ్ల తరువాత నిందితుడి అరెస్ట్‌  | Destruction of Government Property TN Police Arrested Ramesh Hiding For 8 Years | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్ల తరువాత నిందితుడి అరెస్ట్‌ 

Mar 25 2021 9:11 AM | Updated on Mar 25 2021 9:11 AM

Destruction of Government Property TN Police Arrested Ramesh Hiding For 8 Years - Sakshi

తిరువొత్తియూరు : ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో ఎనిమిదేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న నిందితుడు నాగైకి చెందిన ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ రమేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. నాగపట్టణానికి చెందిన రమేష్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌. 2013లో జరిగిన ఓ ధర్నాలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి రమేష్‌ కోసం గాలించారు. అప్పటికే అతడు విదేశాలకు పారిపోయాడు. ఈ క్రమంలో ఓమెన్‌ రాజధాని మస్కట్‌ నుంచి ఒమన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో మంగళవారం రాత్రి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు. నిందితుడిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement