యధాతథంగానే విశాఖ ఉక్కు డిజిన్వెస్ట్‌మెంట్‌ | Centre clarifies of Privatisation of Vizag Steel plant | Sakshi
Sakshi News home page

యధాతథంగానే విశాఖ ఉక్కు డిజిన్వెస్ట్‌మెంట్‌

Apr 15 2023 6:00 AM | Updated on Apr 15 2023 6:00 AM

Centre clarifies of Privatisation of Vizag Steel plant - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు (ఆర్‌ఐఎన్‌ఎల్‌)లో పెట్టుబడుల ఉపసంహరణ యథాతథంగా కొనసాగుతుందని కేంద్ర ఉక్కు శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పురోగతిలోనే ఉందని తెలిపింది. పనితీరును మెరుగుపర్చుకునేందుకు  కంపెనీ ప్రయత్నాలు చేస్తోందని శుక్రవారం ఒక ప్రకటనలో వివరించింది.

వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రస్తుతానికి నిలిపివేస్తోందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర ఉక్కు శాఖ ఈ మేరకు వివరణ ఇచ్చింది. వైజాగ్‌ స్టీల్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 7 మిలియన్‌ టన్నులు. కంపెనీలో ప్రభుత్వానికి ఉన్న 100 శాతం వాటాలను విక్రయించే ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఈఏ) 2021 జనవరి 27న ఆమోదముద్ర వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement