Uttarakhand: బహుభార్యత్వ వివాదం.. మాజీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు | BJP Issues Show Cause Notice to Former MLA Suresh | Sakshi
Sakshi News home page

Uttarakhand: బహుభార్యత్వ వివాదం.. మాజీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు

Jun 24 2025 2:02 PM | Updated on Jun 24 2025 3:01 PM

BJP Issues Show Cause Notice to Former MLA Suresh

హరిద్వార్: ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే  బహుభార్యత్వం వివాదంలో చిక్కుకున్నారు.. సహరాన్ పూర్‌కు చెందిన నటి ఊర్మిళ సనావర్‌ను ఇటీవలే రెండవ వివాహం చేసుకున్నట్లు ప్రకటించిన జ్వాలాపూర్ మాజీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్‌కు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) షోకాజ్ నోటీసు జారీచేసింది. రాష్ట్రంలో అమలయిన యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) నేపథ్యంలో ఈ బహభార్యత్వ ఉదంతం వివాదాస్పదంగా మారింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర భట్ సూచనల మేరకు జారీ చేసిన ఈ నోటీసుపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్ర బిష్ట్ సంతకం చేశారు. రాథోడ్ క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరించడం, పార్టీ నేతలతో సమన్వయంతో మెలగకపోవడం లాంటివి పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీనిపై ఏడు రోజుల్లోగా స్పందించాలని రాథోడ్‌ను కోరారు.

జూన్ 15న సురేష్‌ రాథోఢ్‌ సహరాన్‌పూర్‌లో  విలేకరుల సమావేశం నిర్వహించి, తనకు ఊర్మిళా సనావర్‌తో  ఉన్న సంబంధాన్ని బహిరంగంగా అంగీకరిస్తూ, ఆమెను తన భార్యగా వెల్లడించిన దరిమిలా ఈ వివాదం చెలరేగింది. నాడు రాథోడ్‌ జంట మీడియా ముందు  కనిపించింది. ఈ నేపధ్యంలో ప్రతిపక్ష పార్టీలు బీజేపీని దుమ్మెత్తిపోశాయి. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేసిన యూసీసీ బహుభార్యత్వాన్ని నిషేధిస్తుందని, వివాహాల నమోదును తప్పనిసరి చేస్తుందని వారు గుర్తుచేశారు. 

ఇది కూడా చదవండి: మూడో ప్రపంచ యుద్ధం వస్తే.. ఈ దేశాలు సేఫ్‌!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement