మాజీ సీఎం సిద్ధరామయ్యకు అస్వస్థత

Bengaluru: Karnataka EX CM Siddaramaiah Hospital With Fever - Sakshi

సాక్షి, బెంగళూరు: మాజీ సీఎం, సీఎల్పీ నేత సిద్ధరామయ్య (71) ఆదివారం నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో కార్యక్రమాలను రద్దుచేసుకొని ఇంట్లోనే ఉన్నారు. మందుజాగ్రత్తగా మంగళవారం ఆయన మణిపాల్‌ ఆస్పత్రిలో చేరారు. కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా 72 ఏళ్ల ఆయన గతేడాది ఆగస్టులో మూత్రపిండాల ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రి పాలయ్యారు. దీంతో పాటు ఆయనకు కరోనా ఇన్ఫెక్షన్ కూడా సోకింది. 

చదవండి: మద్యం హోం డెలివరీకి ఢిల్లీ ప్రభుత్వం అనుమతి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top