‘అప్పు తీర్చకపోతే చావు’ | Bank Employee Rude Behaviour On Women Over Loan Issue In Karnataka | Sakshi
Sakshi News home page

‘అప్పు తీర్చకపోతే చావు’

Nov 20 2022 10:03 AM | Updated on Nov 20 2022 10:25 AM

Bank Employee Rude Behaviour On Women Over Loan Issue In Karnataka - Sakshi

మైసూరు: అప్పు కంతు చెల్లించకపోతే చావు అంటూ మహిళా రైతును ఒక బ్యాంకు ఉద్యోగి  దూషించాడు. నీవు చస్తేనే నీ రుణం మాఫీ అవుతుందంటూ హేళన చేసిన ఘటన మైసూరు జిల్లా హుణసూరు తాలూకా కొళఘట్ట  లో జరిగింది. లతా అనే మహిళ రైతు ప్రైవేటు బ్యాంకులో రూ. 50 వేల రుణం తీసుకుంది. వారానికి రూ. 500 కంతు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది.

ఈ క్రమంలో రుణం వసూలు కోసం వచ్చిన బ్యాంకు సిబ్బంది సురేశ్‌ నడి రోడ్డుపై ఆమెను దూషించాడు. వెంటనే రూ. 500 చెల్లించాలని పట్టుబట్టాడు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పినా వినిపించుకోలేదు. అప్పు తీర్చలేకపోతే చావు... అప్పుడే నీ రుణం మాఫీ అవుతుందని అందరి ఎదుట దూషించాడు.

చదవండి: భారత ఆర్మీని పెళ్లికి ఆహ్వానించిన నవజంట.. సైన్యం రిప్లై ఇదే..

Advertisement
 
Advertisement
Advertisement