
మేనకోడలిపై మనసు పారేసుకున్న ఓ అత్త భర్తను వదిలేసింది. మేనకోడల్ని మనువాడింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
బీహార్ రాష్ట్రం గోపాల్గంజ్ జిల్లాలో బెల్వా గ్రామంలో వింతఘటన చోటు చేసుకుంది. గ్రామంలో నివాసం ఉండే అత్త తన మేనకోడలిని పెళ్లి చేసుకునేందుకు తన భర్తను విడిచిపెట్టింది. గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నఈ జంట పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తాము పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు.
బంధువుల సమక్షంలో స్థానిక దుర్గా భవాని ఆలయంలో అత్త మేనకోడలు వివాహం చేసుకున్నారు. కోడలి మెడలో అత్త మంగళ సూత్రం కట్టింది. అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిచారు. ఏడు జన్మలు ఒకరితో ఒకరు కలిసుంటామని వాగ్దానం కూడా చేశారు. ఇంకెవరితోనో పెళ్లి చేస్తారన్న భయంతో మేన కోడలు ఇంటి నుంచి పారిపోయి తన వద్దకు వచ్చిందని, వెంటనే వారిద్దరూ వివాహం చేసుకున్నట్లు తెలిపారు. అత్త,మేనకోడలి వివాహంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
Shockingly, an aunt and her niece got married in Bihar’s Gopalganj.
The two had been having an affair for three years, which has now culminated in marriage. pic.twitter.com/TllfEUf7K0— Habeeb Masood Al-Aidroos (@habeeb_masood) August 12, 2024