Tamilnadu: సీఐ సమక్షంలో ఎస్‌ఐల డిష్యుం..డిష్యుం

Arguments Between Sub Inspectors In Tamilnadu - Sakshi

సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకోవడంలో ఇద్దరు ఎస్‌ఐల మధ్య వివాదం చెలరేగింది. ఇన్‌స్పెక్టర్‌ సమక్షంలోనే ముష్టియుద్ధం చేసుకున్నారు. తంజై జిల్లా ఒరత్తనాడు పోలీసుస్టేషన్‌లో ఈ నెల 13వ తేదీ ఎస్‌ఐ కామరాజ్‌ డ్యూటీలో ఉన్నారు. ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడానికి వచ్చారు. అయితే కామరాజ్‌ ఫిర్యాదు తీసుకోకుండా మరుసటి రోజు రావాలని తెలిపాడు.

మరుసటి రోజు వచ్చిన ఆ వ్యక్తి ఎస్‌ఐ దురైకన్నుకు ఫిర్యాదు చేసి ముందు రోజు జరిగిన విషయం చెప్పాడు. ఈ క్రమంలో ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశన్‌ సమయంలో ఎస్‌ఐలు ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ విషయం ఎస్పీ రవళిప్రియ దృష్టికి వెళ్లడంతో సోమవారం ఇద్దరిని పిలిపించి విచారణ చేశారు. వారిని తంజావూరు సాయుధ దళం విభాగానికి బదిలీ చేశారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top