సాక్షి, ఢిల్లీ: రాజధాని ఢిల్లీలో జరిగిన భేటీలో కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 14,115 కోట్లతో రెండు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో 6-లేన్ల సొరంగం నిర్మాణానికి ఆమోదం ప్రకటించింది.
కేంద్రం ఆమోదం తెలిపిన రహదారులు
1. ఢిల్లీలో ఆరు లెన్ల ద్యారకా ఎక్స్ప్రెస్ హైవే నెల్సన్ మండేలా మార్గ్, వసంత్ కుంజ్ కనెక్టివిటి కోసం టన్నల్ రోడ్డు నిర్మించనుంది. దీని వ్యయం రూ. 6,970 కోట్లు
2.యూపీలో కాన్పూర్ నుంచి కబ్రాయ్ వరకు 4-లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.


