దేశంలో రెండో మంకీపాక్స్‌ కేసు నమోదు | 38 Year Old Diagnosed With Mpox In Kerala | Sakshi
Sakshi News home page

కేరళలో మంకీపాక్స్‌ కేసు నమోదు

Sep 18 2024 7:28 PM | Updated on Sep 18 2024 7:54 PM

38 Year Old Diagnosed With Mpox In Kerala

తిరువనంతపురం: భారత్‌లో మంకీపాక్స్‌ రెండో కేసు నమోదైంది. ఇటీవలే యూఏఈ నుంచి కేరళ వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్‌‌ నిర్ధారణ అయిందని కేరళ ఆరోగ్య మంత్రి వీనా జార్జ్‌ తెలిపారు. ప్రస్తుతం మంకీపాక్స్‌ సోకిన వ్యక్తికి మలప్పురంలో చికిత్స అందిస్తున్నట్లు  తెలిపారు.

ఆ వ్యక్తికి  మంకీపాక్స్‌ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మెడికల్‌ కాలేజీల్లో మంకీపాక్స్‌ ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే ఢిల్లీలో ఓ  వ్యక్తికి మంకీపాక్స్‌ నిర్ధారణ కాగా చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.మంకీపాక్స్‌ కొత్త వేరియెంట్‌ బయటపడడంతో ఆగస్టులో వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌(డబ్ల్యూహెచ్‌వో) అంతర్జాతీయ అత్యవసర స్థితిగా ప్రకటించింది. 

ఇదీచదవండి..50 ఏళ్ల మిస్టరీకి చెక్‌..కొత్త బ్లడ్‌ గ్రూపు కనిపెట్టిన సైంటిస్టులు

Advertisement
 
Advertisement
Advertisement