సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసులో భాగంగా వీబీజీ రాంజీ పథకంలో 20 ఏళ్లుగా తాత్కాలిక ఉద్యోగులుగా కొనసాగుతున్నాం. సరైన సమయానికి వేతనం రాదు.. పనికి తగిన వేతనం చెల్లించడం లేదు. అయినా ఎప్పటికై నా క్రమబద్ధీకరిస్తారనే ఆలోచనతో విధులు నిర్వర్తిస్తున్నా నేటికీ సమస్యలు పరిష్కరించడం లేదు. ఇక చేసేది లేక హక్కుల సాధన కోసం ఆందోళన బాట పట్టడం తప్పడం లేదు.
– బాలయ్య, జిల్లా అధ్యక్షుడు, వీబీజీ రాంజీ తాత్కాలిక ఉద్యోగుల సంఘం
ఉన్నతాధికారులకు విన్నవించాం..
రాష్ట్ర స్థాయిలో ఉద్యోగుల ఆందోళన ఉండటంతో సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకేళుతున్నాం. ప్రస్తుతం కొత్తగా ఇంచార్జి తీసుకోవడం ద్వార పూర్తి స్థాయిలో ఉద్యమం గురించి తెలుసుకోని, గ్రామీణ ప్రాంతాలలో వీబీజీ రాంజీ పనులు కొనసాగేలా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలతో ముందుకు వెలుతాం.
– రాంమహేశ్వరరావు, ఇన్చార్జి డీఆర్డీఓ
●


