బలగం చిత్రంతో మంచి గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

బలగం చిత్రంతో మంచి గుర్తింపు

Apr 18 2025 1:55 AM | Updated on Apr 18 2025 1:55 AM

బలగం

బలగం చిత్రంతో మంచి గుర్తింపు

మహానంది: బలగం సినిమా తో తనకు మంచి గుర్తింపు వచ్చిందని సినీ నటుడు సంజయ్‌ కృష్ణ అన్నారు. గురు వారం మహానందికి వచ్చిన ఆయన శ్రీ కామేశ్వరీ దేవి, మహానందీశ్వర స్వామి వార్ల ను దర్శించుకొని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. ఆలయానికి వచ్చిన నటుడిని గుర్తించిన అభిమానులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఏపీ ఈఏపీ సెట్‌కు

24 వరకు దరఖాస్తు

నంద్యాల(న్యూటౌన్‌): ఏపీ ఈఏపీ సెట్‌ దరఖాస్తుకు ఈనెల 24వ తేదీ వరకు గడువు ఉందని అధికారులు తెలిపారు. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చరల్‌, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు, అలాగే మే 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్‌కు సంబంధించిన టెస్టు నిర్వహించనున్నారు. దరఖాస్తు సమయంలో విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఏపీఈఏపీసెట్‌ వెబ్‌సైట్‌లో పరీక్ష రాసేందుకు అర్హతలు, ఏపీ ఈఏపీ సెట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, గమనికలు.. తదితర పూర్తి వివరాలు పొందవచ్చు.

అవినీతి ఆరోపణలపై విజిలెన్స్‌ విచారణ

బనగానపల్లెరూరల్‌ : మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం, హార్టికల్చర్‌ తదితర పథకాల్లో జరిగిన అవినీతి ఆరోపణలపై రాష్ట్ర ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీ సర్‌ భవానివర్షా గురువారం విచారణ చేశారు. పలు ఆరోపణలు రావడంతో ఎన్‌ఆర్‌జీఎస్‌ పథకంలో విధులు నిర్వహించే టీఏ, ఈసీలను ఇటీవలనే జిల్లా అధికారులు సస్పెండ్‌ చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన విచారణ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్‌ అధికారి అన్వరాబేగం, ఏపీడీ నరసింహారెడ్డి, ఎంపీడీఓ వెంకటరమణ, ఏపీఓ ప్రతాప్‌, ఈసీ, టీఏలు, కంప్యూటర్‌ ఆపరేటర్లు పాల్గొన్నారు.

21నాటికి ప్రోగ్రెస్‌ కార్డులు అందించాలి

కర్నూలు(సెంట్రల్‌): జిల్లాలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మార్కులతో కూడిన ప్రోగ్రెస్‌ కార్డును ఈనెల 21వ తేదీ నాటికి అందించాలని జేసీ డాక్టర్‌ బి.నవ్య అఽధికారులను ఆదేశించారు. గురువారం పాఠశాలల ముగింపునకు సంబంధించిన అంశాలపై జేసీ వెబెక్స్‌ ద్వారా విద్యాశాఖాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమవారం నుంచే విద్యార్థులను ఉన్నత తరగతులకు ప్రమోట్‌ చేసి అదే రోజు నుంచి బోధన జరిగేలా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,21,632 మంది విద్యార్థులను ఉన్నత తరగతులకు ప్రమోట్‌ చేయాలన్నారు. 1,886 అంగన్‌వాడీ కేంద్రాల నుంచి పూర్వ ప్రాథమిక విద్యను పూర్తి చేసుకొని ప్రాథమిక విద్యలోకి చేరుతుండడంతో వారంతా పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో డీఈఓ శామ్యూల్‌పాల్‌ తదితరులు పాల్గొన్నారు.

60 ఏళ్లు పైబడిన వృద్ధులకు గుర్తింపు కార్డులు

కర్నూలు(అర్బన్‌): జిల్లాలో 60 సంవత్సరాల వయస్సు పైబడిన వయో వృద్ధులు సీనియర్‌ సిటిజన్‌ గుర్తింపు కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్‌ ఫాతిమా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వార్డు సచివాలయాల పరిధిలోని వారు వార్డు ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రెటరీ, గ్రామ సచివాలయాల పరిధిలోని వారు డిజిటల్‌ అసిస్టెంట్లను సంప్రదించి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఆధార్‌కార్డు, ఒక పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో తీసుకెళ్లి దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్డుకు పురుషులు 60 సంవత్సరాలకు పైబడి, మహిళలు 58 సంవత్సరాలకు పైబడిన వారు అర్హులన్నారు. గుర్తింపు కార్డుల జారీకి ఎలాంటి ఆన్‌లైన్‌ దరఖాస్తులు తమ కార్యాలయంలో స్వీకరించబడవని ఆమె స్పష్టం చేశారు.

బలగం చిత్రంతో  మంచి గుర్తింపు 1
1/1

బలగం చిత్రంతో మంచి గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement