
మళ్లీ వర్షం వస్తే నష్టమే
నేను తొమ్మిది ఎకరాలు పొలాన్ని ఎకరాకు రూ. 30 వేలు కౌలు చెల్లించి కౌలుకు తీసుకున్నా. ఖరీఫ్లో మినుము వేశాం. రబీలో మొక్కజొన్న వేయగా ఎకరాకు రూ. 30 వేల వరకు ఖర్చు వచ్చింది. ప్రస్తుతం పైరు కోత దశలో ఉంది. గత నెల నుంచి అకాల వర్షాలు దెబ్బతీశాయి. మళ్లీ వర్షం వస్తే దిగుబడులు తడిచి నష్టం వాటిల్లుతుంది.
– భూపాల్రెడ్డి రైతు, ఆకుమల్ల,సంజామల మండలం
రైతులను ఆదుకోవాలి
ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాలతో మొక్కజొన్నలో దిగుబడులు తగ్గాయి. రబీ సీజన్లో మొక్కజొన్నకు మార్కెట్లో మద్దతు ధర అంతంత మా త్రంగానే ఉంది. ఎరువులు, పురుగు మందులు, తదితర ఖర్చుల రూపంలో పెట్టుబడులు పెరిగాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంట ఉత్పత్తులను కొని రైతులను ఆదుకోవాలి. – సుధాకర్రెడ్డి, రైతు
కంపమల్ల,కోవెలకుంట్ల మండలం
మద్దతు ధర లేదు
రబీ సీజన్లో రెండు ఎకరాల సొంత పొలంలో మొక్కజొన్న వేశా. ఎండు తెగులు రావడంతో పంటను కాపాడుకునేందుకు కష్టాలు పడ్డాను. పెట్టుబడి పెరిగింది. దిగుబడి మాత్రం అరకొరే. మార్కెట్లో మద్దతు ధర లేదు. చాలా నష్టం వచ్చింది.
– కుళాయప్ప, రైతు, అమడాల,
కోవెలకుంట్ల మండలం

మళ్లీ వర్షం వస్తే నష్టమే

మళ్లీ వర్షం వస్తే నష్టమే