దేవరకొండ ప్రాంతీయ ఆస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్య పెరిగింది. జూన్ నెలలో సగటున రోజకు 600 వందల మంది రాగా, జూలైలో ఏడెనిమిది వందలు పెరిగింది. కరోనా సమయంలో ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఆక్సీజన్ ప్లాంట్ వినియోగంలో లేకుండాపోయింది. ఆసుపత్రిలో సీటీ స్కాన్ లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రకాల ఇంక్షన్లు ఆస్పత్రిలో అందుబాటులో ఉండటం లేదని రోగులు పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ఏరియా ఆసుపత్రిలోనూ రోగుల సంఖ్య పెరిగింది. జూన్ నెలలో 5825 మంది రోగులు ఆసుపత్రికి రాగా, జూలైలో 6826 మంది ఆసుపత్రికి వచ్చారు.


