అంబులెన్స్‌లను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

అంబులెన్స్‌లను సద్వినియోగం చేసుకోవాలి

Jul 26 2026 3:14 AM | Updated on Jul 26 2026 3:14 AM

శాలిగౌరారం : ప్రభుత్వం నడిపిస్తున్న 108, 102 అంబులెన్స్‌ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్‌ ప్రదీప్‌కుమార్‌ అన్నారు. శాలిగౌరారం పీహెచ్‌సీ ఆవరణలో ఉన్న 108, 102 అంబులెన్స్‌లను ఆయన శనివారం తనఖీ చేశారు. ఈ సందర్భంగా 108 వాహనంలోని అత్యవసర మందులు, వైద్య పరికరాలు, స్టాక్‌ రిజిస్టర్‌, కేసుల రికార్డులను పరిశీలించారు. మండలం నుంచి వచ్చే అత్యవసర వైద్య కేసుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల వైద్యాధికారి సూర్యశిల్పతో సమావేశమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement