తెలంగాణ పబ్లిక్ స్కూల్స్తో ప్రభుత్వ విద్యాస్వరూపం మారుతుంది. ఒకే క్యాంపస్లో ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు అన్ని వసతులతో విద్య అందించే అవకాశం ఉంటుంది. తరగతి గదులు, ల్యాబ్స్, క్రీడా మైదానం, బస్సు తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. నారాయణపేట జిల్లాలో మక్తల్, కోటకొండ జెడ్పీహెచ్ఎస్లను పబ్లిక్ స్కూల్స్గా అభివృద్ధి చేయనున్నారు. ఒక్కో పాఠశాలకు సుమారు రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు ఇది మంచి అవకాశం.
– గోవిందరాజులు, డీఈఓ, నారాయణపేట
●


