మహబూబ్నగర్–హైదరాబాద్–రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. 2007, 2009లో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ నాగేశ్వర్ (స్వతంత్ర అభ్యర్థి), 2015లో రాంచందర్రావు (బీజేపీ), 2021లో సురభి వాణీదేవి (బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్) గెలుపొందారు. ఇప్పటివరకు ఈ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు పరాభవమే ఎదురైంది. ప్రస్తుతం అధికారంలో ఉండడంతో ఈ స్థానంలో విజయమే లక్ష్యంగా ఆ పార్టీ పెద్దలు పక్కా ప్రణాళికలతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముందుస్తు కార్యాచరణతో బలమైన అభ్యర్థిని ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.


