రైతుల వ్యవసాయ భూముల నిర్వహణ కోసం భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా ప్రజల భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ధరణి స్థానంలో కొత్త భూ భారతి పోర్టల్ను ప్రారంభించారని గుర్తుచేశారు. రైతు భరోసా, రైతుల రుణమాఫీ పథకాల అమలుతోపాటు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసి.. వారి అభ్యున్నతికి కృషిచేస్తుందన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వడ్లకు అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తుందన్నారు. ఇందులో భాగంగా 6,496 మంది రైతుల నుంచి 24,244 మె.ట., సన్న రకం ధాన్యం కొనుగోలు చేశారని చెప్పారు.


