గ్రామానికో సమాఖ్య భవనం | - | Sakshi
Sakshi News home page

గ్రామానికో సమాఖ్య భవనం

Jan 6 2026 8:18 AM | Updated on Jan 6 2026 8:18 AM

గ్రామానికో సమాఖ్య భవనం

గ్రామానికో సమాఖ్య భవనం

దశల వారీగా మహిళా సంఘాలకు ఏర్పాటు

200 చదరపు గజాల స్థలం..

అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారితకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగానే గ్రామ మహిళా సంఘాలకు సమాఖ్య భవనాలు నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలకు శాశ్వత వేదికలు ఉండేలా భవనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ భవనాల నిర్మాణ పనులు వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటుంది. ప్రతి గ్రామంలో మహిళా పొదపు సంఘం (ఎస్‌హెచ్‌జీ)కి సమాఖ్య భవనాన్ని నిర్మించనుంది. సంక్రాంతి తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ఏదో ఒకచోట శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత జిల్లాలోని అన్ని గ్రామాల్లో భవనాల నిర్మాణ పనులు మొదలుపెట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుండటంతో పనులు సైతం ఆయా మహిళా సంఘాలకే అప్పగించనున్నారు. గ్రామస్థాయి మహిళా సమాఖ్య భవనాల కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని 20 మండలాల పరిధిలో 460 గ్రామ పంచాయతీలు ఉండగా..1,47,123 మంది సభ్యులతో 13,239 మహిళా సంఘాలు.. 617 గ్రామ సంఘాలు కొనసాగుతున్నాయి.

స్వయం సమృద్ధి దిశగా..

ప్రభుత్వం మహిళా సంఘాలకు విద్యార్థుల దుస్తులు కుట్టే పనితోపాటు పలు పథకాల కింద మహిళకు స్వయం ఉపాధి కల్పిస్తోంది. మహిళా సంఘాలకు టెస్కో ద్వారా వచ్చిన వస్త్రాలను నిల్వ చేసి తమ సభ్యుల ద్వారా కుట్టిస్తున్నారు. ఈ విధానంలో కొన్ని సమస్యలు తలెత్తడంతో మహిళా సమాఖ్యలకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మహిళాలకు దుస్తులు కుట్టడంతోపాటు పలు మార్గాల్లో ఉపాధి అందించేలా ప్రత్యేక భవనాలు నిర్మించేందుకు ఆ సంస్థ ప్రతిపాదించగా అందుకు ప్రభుత్వం ఆమోదించింది.

గ్రామ మహిళా

సమాఖ్య సభ్యులు (ఫైల్‌)

ఒక్కో భవనానికి

రూ.10 లక్షల వ్యయం

సంక్రాంతి తర్వాత

శంకుస్థాపనలు

గ్రామస్థాయిలో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవనాలకు ఒక్కో భవనానికి రూ.10 లక్షలు ఖర్చు చేయనున్నారు. భవన నిర్మాణానికి 200 చదరపు గజాల స్థలం సేకరించి 569 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్లాబ్‌తో వర్క్‌షెడ్‌ నిర్మిస్తారు. ఇందులో 500 చదరపు అడుగులలో హాల్‌, రెండు ద్వారాలు, తలుపులు, ఆరు కిటికీలు, ఆరు సీలింగ్‌ ఫ్యాన్లు, 8 ట్యూబ్‌లైట్లు ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఈ నిధులకు తోడు రూ.3 లక్షల వరకు ఉపాధి నిధుల ద్వారా మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement