కాశిబుగ్గ: వరంగల్ కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా డాక్టర్ జాటోతు వెంకటేశ్వర్లు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న డాక్టర్ వెంకటేశ్వర్లును ఫారెన్ సర్వీసు కింద డిప్యూటేషన్పై రిజిస్ట్రార్గా మూడేళ్లపాటు పనిచేయడానికి ప్రభుత్వం ఇటీవల నియమించింది. కాళోజీ హెల్త్వర్సిటీలో ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా పనిచేసిన డాక్టర్ నాగార్జున రెడ్డి జాయింట్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహించనున్నారు. కాగా, డాక్టర్ వెంకటేశ్వర్లును కాశోజీ వీసీ డాక్టర్ రమేష్రెడ్డి, జాయింట్ రిజిస్ట్రార్ డాక్టర్ నాగార్జునరెడ్డి సన్మానించారు.


