అడవికి నిప్పు ప్రజలకు ముప్పు
వాజేడు: అడవిలో అగ్ని ప్రమాదాలపై మంగళవారం మండలపరిధిలోని ధర్మవరం గ్రామంలో ఎఫ్ఎస్ఓ ఎల్. నారాయణ ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవిలో నిప్పు అంటుకుంటే చెట్లు కాలి పోవడంతో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. అడవిలో సంభవించే అగ్ని ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వన్య ప్రాణుల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. ప్లాస్టిక్ రహిత అడవులుగా ఉండాలని, ఏ ఒక్కరూ ప్లాస్టిక్ను అడవుల్లో పడేయొద్దన్నారు. కార్యక్రమంలో పద్మ, మనీష, దామోదర్, జనార్దన్, రాంబాబు, క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


