చట్టాలపై అవగాహన తప్పనిసరి
వెంకటాపురం(ఎం): ప్రతిఒక్కరూ బాల్య వివాహ నిషేధిత చట్టాలపై తప్పనిసరి అవగాహన కలిగి ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యా యసేవ అధికార సంస్థల ఆదేశాలను మేరకు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహ్ ముక్త్భారత్ ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాల్య వివాహా నిషే ధిత చట్టం, పొక్సో, విద్యాహక్కు, ర్యాగింగ్ నిరో ధక చట్టం, మోటార్ వాహనాల చట్టం తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు. బాల్య వివాహా లు ఎక్కడైనా జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. అవసరమైన వారికి ఉచిత న్యాయ సహా యం అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్ 15100కు కాల్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ చీఫ్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాధిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
లీగల్ చీఫ్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్


