తప్పుడు కేసులు పెట్టడం సరికాదు | - | Sakshi
Sakshi News home page

తప్పుడు కేసులు పెట్టడం సరికాదు

Dec 19 2025 8:06 AM | Updated on Dec 19 2025 8:06 AM

తప్పుడు కేసులు పెట్టడం సరికాదు

తప్పుడు కేసులు పెట్టడం సరికాదు

జాతీయ రహదారిపై కాంగ్రెస్‌ ధర్నా

ములుగు: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌ గాంధీ మీద కేంద్ర ప్రభుత్వం తప్పుడు ఈడీ కేసులు పెట్టడం సరికాదని కాంగ్రెస్‌ నాయకులు విమర్శించారు. ఈ మేరకు గురువారం ములుగు జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల మీద కేంద్ర ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు కొమ్ము కాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గొల్లపెల్లి రాజేందర్‌ గౌడ్‌, వంగ రవి యాదవ్‌, చింతనిప్పుల భిక్షపతి, జయపాల్‌రెడ్డి, భగవాన్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చాంద్‌పాషా, శ్రీనివాస్‌, సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement