ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి

Apr 17 2025 1:15 AM | Updated on Apr 17 2025 1:55 AM

ములుగు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్‌ అన్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఎండి చాంద్‌ పాషా ఆధ్వర్యంలో ములుగు మండల ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌తో హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు జై బాపు, జై భీమ్‌, జై సంవిదాన్‌ కార్యక్రమాన్ని ములుగు మండల వ్యాప్తంగా గ్రామ గ్రామాన విజయవంతం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. జై బాపు, జై భీమ్‌, జై సంవిదాన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మండల ఇన్‌చార్జ్‌లుగా వంగ రవియాదవ్‌, చింతనిప్పుల భిక్షపతి, పీఏసీఎస్‌ చైర్మన్‌ బొక్క సత్తిరెడ్డి, ముసినేపల్లి కుమార్‌గౌడ్‌, కూనూరు అశోక్‌గౌడ్‌లను నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement