సమ్మక్క బ్యారేజీ నుంచి దిగువకు నీటి విడుదల | - | Sakshi
Sakshi News home page

సమ్మక్క బ్యారేజీ నుంచి దిగువకు నీటి విడుదల

Apr 16 2025 11:22 AM | Updated on Apr 16 2025 11:24 AM

కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం వద్ద గోదావరిపై ఉన్న సమ్మక్క సాగర్‌ బ్యారేజీ నుంచి చాలా రోజుల తర్వాత అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. గత కొన్ని రోజుల నుంచి దిగవకు నీటిని వదలకుండా బ్యారేజీలో ఉన్న 59గేట్లను మూసేసి నీటిని నిల్వ చేసిన అధికారులు మంగళవారం ఒక గేటును ఎత్తి 300 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దిగువన ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు పూర్తిగా తగ్గడంతో నీటిని దిగువకు వదులుతున్నట్లు తెలుస్తోంది. బ్యారేజీ నీటి పూర్తి సామర్థ్యం 6.94 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.90 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. దేవాదుల ఇన్‌టెక్‌వెల్‌ నుంచి 539 క్యూసెక్కుల నీటిని పంపింగ్‌ చేస్తున్నారు.

మావోయిస్టులకు

వ్యతిరేకంగా వాల్‌పోస్టర్లు

వెంకటాపురం(కె): మండల పరిధిలోని పలు గ్రామాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీ యువజన సంఘం పేరుతో మంగళవారం వాల్‌పోస్టర్లు వెలిశాయి. అడవుల్లో విచ్చలవిడిగా బాంబులు పెట్టడం సరికాదు.. ఆదివాసీలను చంపడం మీ సిద్ధాంతామా..అడవుల్లో బాంబులు ఆదివాసీగూడెల్లో గుబులు మావోయిస్టులారా సిగ్గు సిగ్గు అంటూ వాల్‌పోస్టర్లలో ఉన్నాయి.

సమ్మక్క బ్యారేజీ నుంచి  దిగువకు నీటి విడుదల
1
1/1

సమ్మక్క బ్యారేజీ నుంచి దిగువకు నీటి విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement