
ముంబైలో ల్యాండ్ అయ్యారు హీరో యశ్. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా నితీష్ తివారి దర్శకత్వంలో హిందీలో ‘రామాయణ’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాను నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలోని రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్మణుడిగా రవి దుబే, హనుమంతుడు పాత్రలో సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లారు యశ్. ఈ షెడ్యూల్లో యశ్ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే జరుగుతుందని, రణ్బీర్ కపూర్ పాల్గొనరని సమాచారం. ఇక ‘రామాయణ’ తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి రిలీజ్ చేస్తామని ఆల్రెడీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.