చెబుతావా రత్నం | Vishal New Mocie Ratnam Song released | Sakshi
Sakshi News home page

చెబుతావా రత్నం

Apr 11 2024 1:11 AM | Updated on Apr 11 2024 1:11 AM

Vishal New Mocie Ratnam Song released - Sakshi

విశాల్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రత్నం’. హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటించారు. కార్తికేయన్‌ సంతానం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న తెలుగు, తమిళ్‌లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని శ్రీ సిరి సాయి సినిమాస్‌ బ్యానర్‌పై తెలుగులో సీహెచ్‌ సతీష్‌ కుమార్, కె. రాజ్‌కుమార్‌ విడుదల చేస్తున్నారు.

దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘చెబుతావా..’ అంటూ సాగే పాటని రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా, సింధూరి విశాల్‌ పాడారు. ‘‘యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘రత్నం’.  ‘చెబుతావా..’ పాట మెలోడియస్‌గా, ఎమోషనల్‌గా సాగుతుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement