
సాత్విక్ వర్మ, ప్రీతి నేహా జంటగా నటించిన చిత్రం ‘ప్రేమిస్తున్నా’. భాను దర్శకత్వంలో వరలక్ష్మీ పప్పుల సమర్పణలో కనకదుర్గారావు పప్పుల నిర్మించారు.
ఈ చిత్రంలో ‘ఎవరే నువ్వు...’ అంటూ సాగే రెండో పాటను నటుడు విజయ్ సేతుపతి రిలీజ్ చేసి, ఈ ప్రేమకథా చిత్రం విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారు. సిద్ధార్థ్ సాలూర్ స్వరపరచిన ఈ పాటకు పూర్ణచంద్ర సాహిత్యం అందించారు. ‘‘మంచి మ్యూజికల్ లవ్స్టోరీగా రూపొందించాం’’ అన్నారు భాను.