హనుమాన్ మూవీతో బ్లాక్బస్టర్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ పనులతో బిజీగా ఉన్నారు. జై హనుమాన్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ వైరలవుతోంది.
ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో రానా కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అశ్వద్ధామ పాత్ర రానా పోషించబోతున్నారని తెలుస్తోంది. ఈ పాత్రతో రానా కూడా చాలా రోజుల తర్వాత మరింత పవర్ఫుల్గా కనిపించబోతున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల టాక్. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ సినిమాతో రానా మరోసారి పాన్ ఇండియా రేంజ్లో అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
#RanaDaggubati to Play Ashwatthama in Jai Hanuman😳
Rana is reportedly set to play the powerful Ashwatthama in #JaiHanuman marking his return to a massive pan-India project.
Directed by #PrasanthVarma the sequel to #HanuMan is shaping up as a grand mythological spectacle, with… pic.twitter.com/Zrx0z9ippu— The South Cinemaa (@southcinemaaaa) July 27, 2026


