Tollywood Comedians: ఒకే ఫ్రేమ్‌లో మన తెలుగు కమెడియన్స్‌, పార్టీలో రచ్చ.. ఫొటో వైరల్‌

Vennela Kishore Dhanraj And Other Comedians Get Together Photo Goes Viral - Sakshi

వెండితెరపై మనల్ని కడపుబ్బా నవ్వించే మన తెలుగు కమెడియన్స్‌ అంతా ఒకచోటే చేరితే ఎలా ఉంటుంది. ఊహించుకుంటూనే వారు చేసే రచ్చ ఎలా ఉంటుందో కళ్ల ముందు కదలాడుతుంది కదా. మరి నిజంగానే వారంత ఒక్కచోట చేరితే. ఇక ఫ్యాన్స్‌, ప్రేక్షకులకు కనులవిందె. వేణు(టిల్లు), సప్తగిరి, శ్రీనివాస్‌ రెడ్డి, చిత్రం శ్రీను, వెన్నెల కిషోర్‌ పలువురు కమెడియన్స్‌ ఒకప్పుడు మనల్ని తమ కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. అయితే కొంతకాలంగా వారిలో కొంతమంది వెండితెరపై తక్కువగా కనిపిస్తున్నారు.

చదవండి: ష‌ణ్ముఖ్‌, సిరిలపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన జెస్సీ.. అరియాన షాక్‌

దీంతో దీంతో వారి కామెడీని, నటనను మన తెలుగు ప్రేక్షకులు మిస్‌ అవుతున్నారు. అలాంటి వారికి మరోసారి కనువిందు చేసే ఓ ఫొటతో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మన ఒకప్పటి కమెడియన్స్‌తో పాటు ఇప్పుటి కమెడియన్స్‌ అంతా ఒక్కచోట చేరారు.  వేణు, శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిషోర్‌, ధన్‌రాజ్‌, రాజేశ్‌తో పాటు పలువురు కమెడియన్స్‌ కొన్ని రోజుల క్రితం కొంతమంది కలిసి ఫ్లయింగ్ కలర్స్ అనే ఓ గ్రూప్‌ను పెట్టుకున్నారు.

చదవండి: మరింత దూకుడుగా సమంత, త్వరలో హాలీవుడ్‌ ఎంట్రీ!

ఈ గ్రూప్ వాళ్ళు ప్రతి నెల ఎవరో ఒకరి ఇంట్లో కలుస్తూ సరదాగా పార్టీ చేసుకుంటారు. ప్రతి సారి ఏదో ఒక థీమ్‌తో పార్టీ చేసుకుంటారు. తాజాగా సండే వీకెండ్‌ సందర్భంగా ఈ గ్రూప్ మెంబర్స్ మళ్ళీ కలుసుకుని పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో అందరూ బ్లూ కలర్‌ డెనిమ్‌ షర్ట్‌, ప్యాంటుతో మెరిపించారు. ఈ నేపథ్యంలో కమెడియన్‌ వేణు(టిల్లు) వారందరి గ్రూప్‌ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ షేర్‌ చేస్తూ  నిన్న మా కలర్స్‌తో హ్యాపీ సండే అంటూ రాసుకొచ్చాడు. అలాగే ధన్‌రాజ్‌ కూడా ఈ ఫొటోను షేర్‌ చేస్తూ ‘స్వీట్ అండ్ క్యూట్ పార్టీ. హోస్టింగ్ చేసింది వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య. లవ్ యూ’ అంటూ షేర్ చేశాడు.

చదవండి: రియల్‌ సినతల్లికి రూ. 10 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top