అయోధ్యలో మెగా కోడలు.. బాలరామునికి ప్రత్యేక పూజలు! | Sakshi
Sakshi News home page

Upasana Konidela: అయోధ్య బాలరామున్ని దర్శించుకున్న ఉపాసన!

Published Mon, Mar 11 2024 3:23 PM

Upasana Konidela Visits Ayodhya Temple Today With Her Family - Sakshi

మెగా కోడలు, రామ్‌చరణ్ సతీమణి ఉపాసన అయోధ్య బలరాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉపాసన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసిన సంగతి తెలిసిందే. 

తాజాగా ఉపాసన తన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య రామునికి పూజలు చేశారు. ఆలయంలో దాదాపు 48 రోజుల పాటు నిర్వహించిన రామరాగ్ సేవ ముగింపు వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకలకు తన తాతయ్య, నానమ్మతో సహా కలిసి పాల్గొన్నారు.  దీనికి సంబంధించిన ఫోటోలను ఉపాసన తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 
 

Advertisement
Advertisement