Tamil TV Serial Producer J Krishnaswamy Died With Covid In Chennai - Sakshi
Sakshi News home page

ప్రముఖ బుల్లితెర నిర్మాత మృతి

May 29 2021 8:07 AM | Updated on May 29 2021 10:58 AM

TV Producer J Krishnaswamy Died Due To Corona - Sakshi

చెన్నై: ప్రముఖ బుల్లితెర నిర్మాత జె.కృష్ణస్వామి కరోనా మహమ్మారి బారిన పడి గురువారం చెన్నైలో కన్నుమూశారు. కుంభకోణంకు చెందిన ఈయన మొదట్లో కస్టమ్స్‌ శాఖలో ఉన్నత ఉద్యో›గం చేసేవారు. తర్వాత ఆయన బుల్లితెరకు పరిచయమయ్యారు. అభినయ క్రియేషన్స్‌ సంస్థ ద్వారా మాంభూమి కి మామియార్, మహారాణి సెంగమలం, గ్రీన్‌ సిగ్నల్, చెల్లమ్మ, దేవతై తదితర మెగా సీరియ ళ్లు నిర్మించారు. ఆయన వారం రోజుల క్రితం కరోనా బారిన పడడంతో స్థానిక క్రోంపేటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి గురువారం మృతిచెందారు. ఆయన మృతికి బుల్లితెరకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

చదవండి : కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement