Tollywood Cine Workers Strike: ఫిలిం ఫెడరేషన్‌ ఆఫీస్‌ ఎదుట ఉద్రిక్తత

Tollywood Cine Workers Strike OVer Wage Hike - Sakshi

నేటి నుంచి షూటింగ్స్‌ బంద్‌

టాలీవుడ్‌లో నేటి(జూన్‌ 22)నుంచి సినిమా షూటింగ్స్‌ నిలిచిపోయాయి. వేత‌న పెంపు కోరుతూ సినీ కార్మికులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.  తమ వేతనాలు పెంచాలని సిని కార్మికులు గత కొన్నిరోజులుగా డిమాండ్‌ చేస్తున్నారు.  దీనిపై నిర్మాతల మండలి స్పందించకోవడంతో సినీ కార్మికులు షూటింగ్స్‌కి హాజరు కాలేదు.

ప్రతి మూడేళ్లకు ఒక్కసారి కార్మికుల వేతనాలు పెంచాల్సి ఉన్నప్పకీ.. నాలుగేళ్లు దాటినా వేతనాల ఊసే లేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఇదిలా ఉండగా కాసేపట్లో 24 క్రాఫ్ట్స్‌ సభ్యుల సమావేశం జరగునుంది.ఈ నేపథ్యంలో ఫిలిం ఫెడరేషన్‌ ఆఫీస్‌ ముందు భారీగా పోలీసులు మొహరించారు. సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు మాత్రమే ఉండాలని పోలీసలు స్పష్టం చేశారు. కార్మికులెవరు గుమిగూడవద్దని హెచ్చిరంచారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top