అసెంబ్లీలో...

Thalaivi movie shootings resume - Sakshi

దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’ (నాయకి). ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. కరోనా వల్ల చిత్రీకరణ ఆగిపోయింది. తాజాగా చిత్రీకరణను తిరిగి ప్రారంభించాలనుకుంటున్నారు. దీనికోసం అసెంబ్లీ సెట్‌ను నిర్మించారని సమాచారం. ఈ సెట్‌లో పలు కీలక సన్నివేశాలను షూట్‌ చేయనున్నారట. ఈ షెడ్యూల్‌లో కంగనా, ఇతర చిత్రబృందం పాల్గొంటారట. వచ్చే నెల 11 నుంచి షూటింగ్‌ జరగనుంది. ఈ సినిమాలో కరుణానిధిగా ప్రకాశ్‌ రాజ్, యంజీఆర్‌ పాత్రలో అరవింద స్వామి నటించనున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top