‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విజయంతో జోరుమీదున్న సూర్య.. మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దర్శకుడు జితు మాధవన్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి ‘సీన్’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబరు 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
నజ్రియా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నస్లెన్, ఆనంద్రాజ్, లాల్, రాజ్ ప్రియన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘రోమాంచం’, ‘ఆవేశం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన జితు మాధవన్.. తొలిసారి సూర్యతో కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. సూర్య, నజ్రియా జోడీ ఎలా అలరిస్తుందో చూడాలి.
ఇదీ చదవండి: ఇక రిటైర్ కావాలనుకుంటున్నా: అమితాబ్ బచ్చన్


