నాన్‌స్టాప్‌గా నవ్వుకున్నాను: సుమంత్‌ ప్రభాస్‌ | Sumanth Prabhas about Romanchakam | Sakshi
Sakshi News home page

నాన్‌స్టాప్‌గా నవ్వుకున్నాను: సుమంత్‌ ప్రభాస్‌

Aug 22 2026 2:00 AM | Updated on Aug 22 2026 2:00 AM

Sumanth Prabhas about Romanchakam

వేణుగోపాల్, అనంతిక, సుమంత్‌ ప్రభాస్, సునీల్‌ నారంగ్, ప్రణయ్‌ రెడ్డి

సుమంత్‌ ప్రభాస్, అనంతిక సనీల్‌ కుమార్‌ జంటగా నటించిన చిత్రం ‘రోమాంచకం’. సందీప్‌ రెడ్డి వంగా సమర్పణలో వేణుగోపాల్‌ రెడ్డి దర్శకత్వంలో ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మించిన ఈ సినిమా సెపె్టంబరు 3న విడుదల కానుంది. ఏషియన్‌ సినిమాస్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ఈ చిత్రాన్ని సునీల్‌ నారంగ్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా సుమంత్‌ ప్రభాస్‌ మాట్లాడుతూ–‘‘భద్రకాళీ పిక్చర్స్‌ అంటే అందరికీ డ్రీమ్‌ బ్యానర్‌. ఓ అవార్డు ఫంక్షన్‌లో ఓ కథ వినమని సందీప్‌ అన్న చెబితే ఏదో ఇంటెన్స్‌ కథ అనుకున్నాను. కానీ వేణుగోపాల్‌ అన్న చెప్పిన కథ విని రెండున్నర గంటలు నాన్‌స్టాప్‌గా నవ్వుకున్నాను. 

ఈ చిత్రంలోని ప్రతి క్యారెక్టర్‌ను ఆడియన్స్‌ గుర్తు పెట్టుకుంటారు’’ అని చెప్పారు. ‘‘మన పనే ముందు మాట్లాడాలనేది ఈ బ్యానర్‌ మోటో. మా పనిలో సందీప్‌గారు జోక్యం చేసుకోలేదు’’ అన్నారు వేణుగోపాల్‌ రెడ్డి. ‘‘బడ్డీ కామెడీ సినిమా ఇది. పేపర్‌ మీద ఏ బడ్జెట్‌ అనుకున్నామో, ఆ బడ్జెట్‌లోనే సినిమా చేశాడు వేణుగోపాల్‌. లీడ్‌ యాక్టర్స్‌ పెర్ఫార్మెన్స్‌లను ఆడియన్స్‌ కొత్తగా ఫీలవుతారు’’ అని తెలిపారు ప్రణయ్‌ రెడ్డి వంగా. ‘‘రోమాంచకం’ సినిమా సక్సెస్‌పై మాకు పూర్తి నమ్మకం ఉంది’’ అని తెలిపారు డిస్ట్రిబ్యూటర్, ప్రోడ్యూసర్‌ సునీల్‌ నారంగ్‌. ఈ కార్యక్రమంలో నటీనటులు కీర్తన, నరేంద్ర, మణి, సోహన్, ప్రోడక్షన్‌ డిజైనర్‌ ఖుషి, డీవోపీ పవన్‌ పప్పుల మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement