
ఇటీవల పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్న నటి సమంత తెరపై కనిపించి చాలా కాలమే అయ్యింది. అయితే వెబ్ సిరీస్లతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. అంతకన్నా షోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. త్వరలో మళ్లీ నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా పుష్ప– 2 చిత్రంతో ప్రపంచ స్థాయిలో దుమ్మురేపిన నటుడు అల్లు అర్జున్ తాజాగా అంతకు మించిన చిత్రం చేయడానికి రెడీ అయ్యిపోయారు. ఆయన నటిస్తున్న పాన్ వరల్డ్ చిత్రానికి సబంధించిన ప్రకటన అట్టహాసంగా వెలువడిన విషయం తెలిసిందే. చేసిన ఐదు చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న యువ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ నటించనున్నారు. కోలీవుడ్లో చిత్రం చేయాలన్నది అల్లు అర్జున్ చిరకాల కోరిక.

చాలా కాలం క్రితమే లింగుసామి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అయ్యారు. దీనికి సంబధించిన ప్రకటనను గ్రాండ్గా వెల్లడించారు. అయితే కారణాలేమైనా ఆ చిత్రం సెట్పైకి రాలేదు. అలాంటిది తాజాగా అల్లుఅర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ వరల్డ్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ రూ.600 కోట్ల బడ్జెట్లో ప్లాన్ చేస్తుంది. ఇది సైన్స్ ఫిక్షన్ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఈ చిత్ర యూనిట్కు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో నటి సమంత కూడా ఉన్నారు. ఆమె ఇంతకు ముందు నటుడు అల్లు అర్జున్కు జంటగా సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో నటించారు. అదే విధంగా దర్శకుడు అట్లీతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఈయన ఇంతకు ముందు దర్శకత్వం వమించిన మెర్సల్, తెరి చిత్రాల్లో నాయకిగా నటించారన్నది గమనార్హం.

ఇకపోతే నటి సమంత నటుడు అల్లు అర్జున్ గురించి తన ఇన్స్ట్రాగామ్లో చేసిన పోస్ట్లో మళ్లీ ఒక ఏడాది.ఈ అద్భుతమైన నటుడి ఎదుగుదలను చూడటానికి సహనం పాటించలేకపోతున్నాను. తెరపై మిమ్మల్ని ఎప్పుడు చూసినా మధురమైన దిగ్భ్రాంతి. ప్రతిసారి హద్దులు దాటిన చర్యలకు ధన్యవాదాలు. మీ ఆరోగ్యం బాగుండాలి. ఆసక్తి తగ్గకుండా మీరు ప్రేమించే కార్యాలను వరుసగా చేయాలని భగవంతుడు ఆశ్వీదించా అని నటి సమంత పేర్కొన్నారు. సమంత పోస్ట్ ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా అల్లుఅర్జున్, అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈభారీ చిత్రంలో నటి సమంత కూడా భాగం కానున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.