
సాక్షి, చెన్నై : గత కొన్నిరోజులుగా కరోనాతో చికిత్స తీసుకుంటున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా మెరుగవుతోంది. తాజాగా ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు ఎంజీఎం వైద్యుల పర్యవేక్షణలో ఎక్మో సపోర్ట్తో చికిత్స అందుతోంది. కాగా, ఈ నెల 5న ఎస్పీ బాలు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.దీంతో ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. అయితే మొదట ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నా.. మధ్యలో కాస్త విషమించింది. అనంతరం ఇప్పుడు కోలుకుంటున్నారు.