
సోషల్ మీడియా వచ్చాక ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతున్నారో అర్థం కావడం లేదు. గతంలో సోషల్ మీడియా వల్ల ఎంతో మంది ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. అలాంటి వారి పేరు కూడా తెలియని వారు చాలామంది ఫేమస్ అయ్యారు. కుమారి ఆంటీ, కుర్చీ తాత, మోనాలిసా ఇలా ఎందరో ఉన్నారు. హైదరాబాద్లో రోడ్డు పక్కన్ భోజనాలు విక్రయించే కుమారి ఆంటీ ఓకే ఒక్క మాటతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది. టూ లివర్స్ ఎక్స్ట్రా మీది మొత్తం థౌజండ్ అయ్యిందని ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి.
అదే ఫేమ్తో ఇప్పుడు ఏకంగా మూవీ ప్రమోషన్లలో భాగమయ్యారు కుమారి ఆంటీ. నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల జంటగా నటించిన సినిమా షో టైమ్ ప్రమోషన్లలో సందడి చేశారు. సోషల్ మీడియా వల్ల వచ్చిన క్రేజ్తో ఆమె ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కుమారి ఆంటీ ప్రమోషన్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది.
నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల జంటగా నటించిన లేటేస్ట్ మూవీ 'షో టైమ్'. అనిల్ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ పతాకంపై కిషోర్ గరికిపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మదన్ దక్షిణా మూర్తి దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో వీకే నరేష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్గా వస్తోన్న ఈ చిత్రం జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.