నాని హీరోగా వస్తోన్న యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న రెండో మూవీ కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ అభిమానులను అలరించాయి. ముఖ్యంగా ఆయా షేర్, ఏషనాగుల సాగ్స్ ఎలాంటి రికార్స్ సృష్టించారో చెప్పనవసరంలేదు. ఒక్క ఏషనాగుల సాంగే విడుదలైన కొద్ది రోజులకే 52 మిలియన్ వ్యూస్ దాటింది. మరి ఈ పాటలు పాడిన సింగర్కు ఎంత పారితోషకం ఇచ్చుంటారని సోషల్మీడియాలో హాట్టాపిక్గా మారింది.
రూ. 5 లక్షల పారితోషికం ఇచ్చారా..
ఈ పాటలను పాడింది సింగర్ జంగి రెడ్డి అని విషయం తెలిసిందే.. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యులో యాంకర్ అడిగిన ప్రశ్నలకు బదులు ఇస్తూ తన రెమ్యునరేషన్ కోసం వెల్లడించారు. ‘ ఆ పాటల ద్వారా లభించిన విజయం , ప్రజాదరణ ముందు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ చాలా చిన్నది. పాటల సక్సెస్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. రూ. 5 లక్షల పారితోషికం ఇచ్చారా అని అడిగిన ప్రశ్నకు ‘అంత స్థాయిలో పారితోషికం ఇవ్వలేదని తేల్చి చెప్పారు. అయితే నా కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చారని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: అభిమానికి అండగా రామ్.. ఆమె కోసం మరో అడుగు
ట్రైలర్ లేకుండానే సినిమా..
కాగా ఈ చిత్రం సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ‘ది ప్యారడైజ్’ సినిమాకు ట్రైలర్ ఉండదని నాని స్పష్టం చేశారు. ‘ది ప్యారడైజ్కి ట్రైలర్ ఉండదు. బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం టీమ్ మొత్తం కలిసి పనిచేయాలి. ప్రేక్షకులను గ్రాంటెడ్గా తీసుకోవడం లేదు. మీకు ఇస్తే అదిరిపోయే ట్రైలర్ ఇవ్వాలి. దీనికోసం నాలుగైదు రోజులు శ్రీకాంత్, అనిరుధ్ అందరూ దానిపై పనిచేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని నాని చెప్పుకొచ్చారు. దీంతో ట్రైలర్ లేకుండా సినిమా ప్రేక్షకుల ముందుకు ఎలా రాబోతోందనే ఆసక్తి నెలకొంది.


