
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'శంబాల'. సూపర్ నేచురల్ హారర్ కాన్సెప్ట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అర్చన అయ్యర్, శ్వాసిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదివరకే పోస్టర్స్ రిలీజ్ చేసిన టీమ్.. ఇప్పుడు టీజర్ని విడుదల చేసింది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న టీజర్.. అంచనాలు పెంచుతోంది.
(ఇదీ చదవండి: బన్నీ-అట్లీ మూవీ క్రేజీ అప్డేట్.. హీరోయిన్ ఎవరంటే?)
ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' సినిమాలో శంబాల అనే ప్రాంతం ఉంటుంది. ఇప్పుడు ఆది సాయి కుమార్ అదే పేరుతో సినిమాతో తీస్తున్నాడు. టీజర్ బట్టి చూస్తే.. అంతరిక్షం నుంచి ఓ ఉల్క లాంటి పదార్థం ఓ ఊరిలో పడుతుంది. అప్పటినుంచి ఆ ఊరిలో మనుషులు అందరూ వింతగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి చోటుకు హీరో వస్తాడు? చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. త్వరలో రిలీజ్ డేట్ గురించి ప్రకటించనున్నారు.
ఈ సినిమాలో 'మొగలిరేకులు' ఫేమ్ ఇంద్రనీల్.. ప్రతినాయక లక్షణాలున్న పాత్రలో కనిపించనున్నాడు. యుగంధర్ ముని దర్శకుడు కాగా.. మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం ఈ జానర్ సినిమాలకు కాస్త ఆదరణ లభిస్తోంది. మరి 'శంబాల'.. ఏం చేస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న తమిళ హీరో.. పోస్ట్ వైరల్)