సమంత బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ఆమె లీడ్ రోల్లో వచ్చిన మా ఇంటి బంగారం సెంచరీ మార్క్ దాటేసింది. కేవలం రిలీజైన 23 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు రాబట్టిన తొలి ఫీమేల్ లీడ్ చిత్రంగా మా ఇంటి బంగారం నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ప్రత్యేక పోస్టర్ పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన మొట్టమొదటి మహిళా తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించిందని పోస్ట్ చేశారు. దీంతో సామ్ ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు.
కాగా.. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీని సామ్ తన సొంత బ్యానర్ ట్రలాలా పిక్చర్స్పై నిర్మించింది. ఈ సినిమాకు సమంత భర్త రాజ్ నిడిమోరు నిర్మాతగా వ్యవహరించారు. జూన్ 19న థియేటర్లలో విడుదలైన మా ఇంటి బంగారం మౌత్ టాక్తో కాసుల వర్షం కురిపించింది
GOLDEN CENTURY FOR #MaaIntiBangaaram 💥#MiB creates HISTORY by becoming THE FIRST EVER FEMALE LED TELUGU FILM to gross 100 CRORES Worldwide. @TralalaPictures @Samanthaprabhu2 #RajNidimoru #NandiniReddy @himankd @gulshandevaiah @diganthmanchale @gautamitads @VasanthMaringa1… pic.twitter.com/MsnP7N60o8
— Tralala Moving Pictures (@TralalaPictures) July 12, 2026
Official : #MaaIntiBangaaram crosses 100 CRORES GROSS WORLDWIDE !
Her Happiness 😊 pic.twitter.com/Vs9Sls0S9M— Rajesh Manne (@rajeshmanne1) July 12, 2026


