టాలీవుడ్ సీనియర్ నటి రాధిక శరత్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలబ్రిటీల పిల్లలను ఎగతాళి చేయడం వాక్ స్వాతంత్ర్యం కాదని మండిపడింది . ప్రముఖుల కుమార్తెలను ఎగతాళి చేయడం హాస్యం కాదని తెలిపింది. ఇది కేవలం మీ పిరికితనమేనని ఎద్దేవా చేసింది. మనకు అవతలి వాళ్ల రూపం కంటే.. వ్యక్తిత్వమే చాలా ముఖ్యమని ట్వీట్లో రాసుకొచ్చింది. కాగా..గతంలో చాలాసార్లు ఖుష్బు కూతుర్లను బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాంటి వారికి తనదైన శైలిలో కౌంటరిచ్చింది.
దీంతో నటి ఖుష్బు కుమార్తెలను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై రాధిక శరత్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడింది. సెలబ్రిటీల పిల్లలను టార్గెట్ చేయడం పిరికిపంద చర్య గట్టిగానే కౌంటరిచ్చింది. వాక్ స్వాతంత్ర్యం అంటే బెదిరించే స్వేచ్ఛ కాదని తెలిపింది. విమర్శించడం అనేది క్రూరత్వం కాదు.. హాస్యం అవమానించడం కాదని హితవు పలికింది. నేను ఖుష్బూ, ఆమె కుమార్తెలకు అండగా నిలుస్తానని పేర్కొంది. ఎవరైనా సరే ఇలాంటి ప్రవర్తన ఎక్కడ జరిగినా సరే తాను ఖండిస్తానని రాధిక శరత్కుమార్ స్పష్టం చేసింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Freedom of speech is not freedom to bully. Criticism is not cruelty. Humour is not humiliation.
Mocking a public figure's daughters is not comedy — it is cowardice. Looks are not an achievement or a failure. Character is.
I stand with Khushbu and her daughters. I condemn this… pic.twitter.com/Dn7WjXRYUU— Radikaa Sarathkumar (@realradikaa) July 11, 2026


