Rashmika Mandanna: వారిద్దరి వల్లే ఇప్పుడు సినిమాలు చేస్తున్నా: రష్మిక మందన్నా

Rashmika Mandanna Comments On Kantara Hero Rishab Shetty - Sakshi

రష్మిక మందన్నా సౌత్‌ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటించింది. పుష్ప సినిమా ఒక్కసారిగా నేషనల్ క్రష్‌గా మారిపోయింది ముద్దుగుమ్మ. ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉంది. అయితే గతంలో రిషబ్‌ శెట్టి కాంతార సినిమాపై కామెంట్స్‌ చేసి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. కన్నడలో ఘన విజయం సాధించిన కాంతార చిత్రం విషయంలో రష్మిక మాటలు తీవ్ర వివాదాస్పదం కావడమే ఇందుకు కారణం. ఒక దశలో కన్నడ చిత్ర పరిశ్రమ రష్మికను బ్యాన్‌ చేసిందనే ప్రచారం కూడా జరిగింది. ఈ విషయంలో రిషబ్‌ శెట్టి, రష్మిక ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రష్మిక రిషబ్‌ శెట్టి, రక్షిత్‌ శెట్టిలపై పాజిటివ్ కామెంట్స్ చేశారు. కిరాక్ పార్టీ అనే చిత్రం ద్వారా తనను ఇండస్ట్రీకి పరిచయం చేసింది వారేనని చెప్పుకొచ్చింది. తాను ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానంటే వారిద్దరే కారణమని తెలిపింది. అయితే ఆ మూవీలో నటించిన హీరో రక్షిత్‌తో ప్రేమాయణం నడిపినట్లు టాక్ వినిపించింది. అలాగే తనపై ఇటీవల సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయని తెలిపింది. ఇకపై అలాంటి వాటిని సహించబోనని చెబుతోంది నేషనల్ క్రష్. సడన్‌గా రిషబ్‌, రక్షిత్‌పై పాజిటివ్ కామెంట్స్ చేయడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top