‘తెలుగు సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ‘బాహుబలి’ నాకు నచ్చిన చిత్రం. తెలుగు సినిమా చాలా అడ్వాన్డ్స్గా ఉంది. అందుకే తెలుగు సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఆ చాన్స్ ‘శ్రీనివాస మంగాపురం’తో లభించినందుకు సంతోషంగా ఉంది. అలాగే నా తొలి తెలుగు సినిమా ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రీకరణ తిరుపతిలో జరగడం నా అదృష్టం. దేవుడు, ప్రేక్షకుల ఆశీస్సులతో ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాషా తడానీ. జయకృష్ణ ఘట్టమనేని, రాషా తడానీ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’.
అశ్వినీదత్ సమర్పణలో అజయ్ భూపతి దర్శకత్వంలో పి. కిరణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. శనివారం విలేకరుల సమావేశంలో రాషా తడానీ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో శ్రీను పాత్రలో జయకృష్ణ, మంగ పాత్రలో నేను నటించాం. మంగ పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయి. ఈ పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. అజయ్ భూపతిగారు ప్రతి డైలాగ్, అందులోని ఎమోషన్ను దగ్గరుండి నేర్పించారు. అశ్వినీదత్గారు నన్ను మనవరాలిలా చూసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ అంతా ఒక విహార యాత్రలా గడిచింది.
నేనైతే కారం దోసెలు ఫుల్లుగా లాగించాను. అలాగే సీరియస్గా వర్క్ చేయాలన్నప్పుడు సీరియస్గానే చేశాం. మా అమ్మానాన్నలకు కూడా తెలుగు సినిమా అంటే అభిమానమే. మా నాన్నగారు (డిస్ట్రిబ్యూటర్–నిర్మాత అనిల్ తడానీ) ఓ సందర్భంలో ముంబై నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అవ్వాలనుకున్నారు. కానీ కుదరలేదు. ప్రస్తుతం తెలుగు భాష అర్థం అవుతోంది. పూర్తిగా నేర్చుకోమని మా అమ్మ సలహా ఇచ్చారు.
నేనూ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉంది. నా తొలి హిందీ చిత్రం ‘ఆజాద్’ పీరియాడికల్ మూవీ. ఆ తర్వాత చేసిన ‘లైకీ లైకా’ డిఫరెంట్ లవ్ ఫిల్మ్. ‘శ్రీనివాస మంగాపురం’ విలేజ్ లవ్స్టోరీ. హిందీలో కామెడీ సినిమా చేస్తున్నాను. ఇలా విభిన్న జానర్స్లో సినిమాలు చేయాలని ఉంది’’ అని అన్నారు.


