
తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం కోట్ల ఆస్తిని కూడబెడుతుంటారు. ఇందుకు సెలబ్రిటీలు ఏమీ అతీతులు కాదని చెప్పవచ్చు. బాలీవుడ్ జంట రణబీర్ కపూర్, అలియా భట్ల (Ranbir Kapoor, Alia Bhatt) ఇల్లు ఎట్టకేలకు పూర్తి అయింది. సుమారు మూడేళ్లుగా ఈ ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ముంబైలోని బాంద్రా నడిబొడ్డున ఉన్న ఈ కొత్త ఇంట్లోకి వారు త్వరలో షిఫ్ట్ కానున్నారు. సుమారు రూ. 250 కోట్ల విలువ చేసే ఈ ఆస్తిని తన కూతురు రాహా కపూర్ పేరుతో ఈ దంపతులు రాశారు. ఆ ఆస్తికి సంరక్షకురాలిగా రణబీర్ కపూర్ అమ్మగారు నటి నీతూ కపూర్ పేరుతో రిజిస్టర్ చేయించారు. అంత ఆస్తిని తమ పేర్లతో రిజిస్ట్రేషన్ చేపించుకోకుండా కూతురు, అమ్మకు గిఫ్ట్గా ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నారు.

ఆ ఇంటితో రణబీర్ అనుబంధం
వాస్తవంగా ఆ ఇల్లు రణబీర్ కపూర్కు వారసత్వంగా వచ్చింది. రాజ్ కపూర్ ఇండస్ట్రీలో పీక్లో ఉన్నప్పుడు దానిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత రిషీ కపూర్ అందులోనే ఉన్నారు. అలా వారసత్వంగా ప్రస్తుతం రణబీర్ కపూర్ చేతికి ఆ ఆస్తి వచ్చింది. అయితే, దానిని రీమోడలింగ్ చేయించారు. పాత కట్టడాలకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఆరు అంతస్తుల విలాసవంతమైన ఇల్లు నిర్మించారు. మరో రెండు నెలల్లో గృహప్రవేశం చేయనున్నారు.

రణబీర్కు ఆ ఇల్లు వారసత్వానికి గుర్తు.. దానిని చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతాడు. అయితే, తనకు కూతురు పుట్టిన తర్వాత కెరీర్ పరంగా ఆయనకు బాగా కలిసొచ్చింది. దీంతో దాదాపు రూ. 250 కోట్లకు పైగా ఉన్న ఆ భవనాన్ని కూతురు రాహా పేరుతో రిజిస్ట్రేషన్ చేపించాడు. దాంతో బాలీవుడ్ కూడా ఆశ్చర్యపోయింది. భవిష్యత్లో తన కూతురు ఆ ఇంట్లో ఎలా ఉండాలో అందుకు అనుగుణంగానే ఆయన నిర్మించుకున్నారట. వచ్చే దీపావళిని తన కూతురుతో అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని వారు ప్లాన్ చేస్తున్నారట.