కరణం మల్లీశ్వరిగా?

Rakul Preet Singh confirmed for Karanam Malliswaris biopic - Sakshi

ఒలింపిక్స్‌లో మనకు పతకాన్ని తీసుకొచ్చిన తెలుగు తేజం కరణం మల్లీశ్వరి జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘రాజుగాడు’ చిత్రాన్ని తెరకెక్కించిన సంజనా రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఈ బయోపిక్‌ను నిర్మించనున్నారు. ఇందులో మల్లీశ్వరి పాత్రలో ఎవరు నటిస్తారనే విషయాన్ని ప్రకటించలేదు. తాప్సీ కనిపిస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. తాజాగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరు తెరమీదకొచ్చింది. మల్లీశ్వరి, రకుల్‌ ప్రీత్‌ల బాడీలాంగ్వేజ్‌ చాలా భిన్నంగా ఉంటుంది. మరి రకుల్‌ని ఫైనలైజ్‌ చేస్తే ప్రోస్థెటిక్‌ మేకప్‌తో లుక్స్‌ని మ్యాచ్‌ చేస్తారేమో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top