గాయకుడు ఛన్నులాల్‌ మరణం బాధించింది: మోదీ | Padma Vibhushan Hindustani Classical Singer Chhannulal Mishra Passes Away At 88, PM Modi Pays Tribute | Sakshi
Sakshi News home page

గాయకుడు ఛన్నులాల్‌ మరణం బాధించింది: మోదీ

Oct 2 2025 10:02 AM | Updated on Oct 2 2025 11:35 AM

Prime Minister modi tribute to singar chennulal misra

ప్రముఖ శాస్త్రీయ గాయకుడు, పద్మ విభూషణ్‌ ఛన్నులాల్‌ మిశ్రా (chhannulal mishra) అనారోగ్యంతో మరణించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన కుమార్తె నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా వయసురీత్యా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఛన్నులాల్‌ మరణం తనను బాధించిందని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. ఆయనతో  తనకు మంచి అనుబంధం ఉందంటూ సంతాపం తెలిపారు.

హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఎలనలేని గుర్తింపు పొందిన ఛన్నులాల్‌ ఉత్తరప్రదేశ్‌లో 1936లో జన్మించారు.  భారతీయ కళ, సంస్కృతి కోసం ఆయన చేసిన సేవకు గుర్తింపుగా కేంద్రప్రభుత్వం పద్మభూషణ్‌ (2010), పద్మ విభూషణ్‌ (2020)తో గౌరవించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement